ప్రస్తుతం ప్రభాస్, గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. రూ.140 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇటీవల మూవీలో ప్రభాస్ లుక్కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్యగా అదరగొడుతున్నాడు. కరోనా వలన ఆగిన ఈ మూవీ షూటింగ్ ఇటీవల ఇటలీలో ప్రారంభించారు. అన్ని జాగ్రత్తలతో షూటింగ్ జరుపుతున్నారు. నేడు డార్లింగ్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా చిత్రం నుండి సర్ప్రైజ్ వీడియో విడుదల చేశారు మేకర్స్. అరచేతిలో అద్భుత ప్రపంచాన్ని చూపిస్తూ ప్రభాస్, పూజాల మధ్య సాగిన రొమాంటిక్ విజువల్ను చూపించారు . ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ట్రైన్ డోర్ లో నుంచి వింటేజ్ ప్రేమికులు ప్రభాస్ – పూజాహెగ్డే బయటకు వేలాడుతున్నట్లు చూపించారు. దీనికి చివరలో మ్యూజిక్ బిట్ జత చేశారు. ఈ వీడియోతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.
previous post
next post
వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి: బొత్స