శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో “రణరంగం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాకినాడ ప్రాంతంలో ఉండే చిన్న రౌడీ… మాఫియాగా మారే నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడని చెబుతున్నారు. శర్వా చేయబోవు రెండు పాత్రలలో ఒకటి యంగ్ ఏజ్ వ్యక్తి కాగా, మరొకటి ముసలి వ్యక్తి అని అంటున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్లో విడుదలవుతుందని అన్నారు. “రణరంగం” ఆగస్టు 15న విడుదల కానున్న విషయం విదితమే. ఈ చిత్రానికి సంబంధించిన మూడవ సాంగ్ ను ఈ రోజు విడుదల చేశారు. “పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్…” అంటూ సాగే ఈ పాటను గీత రచయిత కృష్ణ చైతన్య రచించగా, సంగీత దర్శకుడు సన్నీ ఎం.ఆర్. సమకూర్చిన స్వరాలు అలరిస్తాయి. కథానాయకుడు శర్వానంద్, కాజల్ అగర్వాల్ లపై ఈ సాంగ్ ను చిత్రీకరించారు.