telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం .. ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం..

parlament sessions started today

17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ గా, ఏడుసార్లు బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్ లో సోమవారం(జూన్-17,2019)రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీరేంద్రకుమార్ చేత ప్రొటెం స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేయించారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు,ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ప్రొటెం స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేసిన వీరేంద్రకుమార్ కి రాష్ట్రపతి కోవింద్,ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు.

లోక్‌ సభకు ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారంతో పాటు ఈ నెల 19న జరిగే స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను కూడా ప్రొటెం స్పీకరే నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్ లోని తికమ్ గర్ లోక్ సభ స్థానానికి బీజేపీ ఎంపీగా వీరేంద్ర కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏబీవీపీ కార్యకర్తగా వీరేంద్ర రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.మోడీ ప్రభుత్వంలో 2014 -19 మధ్య కాలంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ, మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 16వ లోక్ సభకు ప్రస్థుత మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ప్రొటెం స్వీకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Related posts