గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాట్గా కనిపించిన ప్రతిసారి ఆమెకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదురవుతోంది. తాజాగా భర్త నిక్తో కలిసి గ్రామీ అవార్డుల వేడుకకు ప్రియాంక హాజరైంది. క్రీమ్ కలర్ డ్రెస్లో భారీగా అందాలను ఆరబోస్తూ ప్రియాంక కనువిందు చేసింది. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. అప్పట్నుంచి ఆమెకు ట్రోలింగ్ మొదలైంది. సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్పై తాజాగా ప్రియాంక స్పందించింది. “గ్రామీ అవార్డుల వేడుక కోసం నేను ధరించిన డ్రెస్పై చాలా ట్రోలింగ్ జరిగింది. అందరూ అనుకుంటున్నట్టు నేను అందాలు ఆరబోయలేదు. స్కిన్ కలర్లో ఉండే ఒకరకమైన క్లాత్ వేసుకుని.. దానిపై క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. అది ఎవరికీ తెలియదు. కెమేరాలు కూడా కనిపెట్టలేవు. వేసుకున్న డ్రెస్కు సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకున్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వేస్తాను” అని ప్రియాంక చెప్పుకొచ్చింది.
previous post
బిగ్ బాస్-3 : రాహుల్ పై వితిక షాకింగ్ కామెంట్స్…!?