telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నివర్‌ తుఫాన్‌ను ఆపింది సీఎం జగనే…

roja ycp mla

ఆంధ్రప్రదేశ్ లో నివర్‌ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది.. తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉన్నాయి. తీవ్రంగా వీస్తున్న గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలాయి. నేషనల్ హైవే పైకి వర్షపు నీరు రావడంతో నెల్లూరులో ట్రాఫిక్‌ జామ్ అయింది. తుపాను కారణంగా నెల్లూరు, చిత్తూరులో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. తిరుమలలో కనుమ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే… తాజాగా నివర్‌ తుఫాన్‌ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సీఎం జగన్ వల్లే.. అతిపెద్ద తుఫాన్ నుంచి తప్పించుకోగలిగామని రోజా పేర్కొన్నారు. అంతేకాదు ఇంకో రెండు తుఫాన్లు పొంచి ఉన్నాయని.. వీటి పైనే సీఎం జగన్ సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. వరదల వల్ల ప్రజలు నష్టపోయారని తెలిసిన వెంటనే ఏరియల్ సర్వే చేశారని.. వరదల వల్ల నష్టపోయిన రైతులందరికీ డిసెంబర్ 31 లోగా నష్టపరిహారం వారి ఎకౌంట్లలో వేస్తారని హామీ ఇచ్చారు రోజా. వరద నష్టం పరిహారం కోసం కేంద్రం పై ఒత్తిడి పెంచుతామని తెలిపారు.

Related posts