గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ పాప్సింగర్ నిక్ జొనాస్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగి.. హాలీవుడ్లోనూ క్వాంటికో సిరీస్లో ప్రతిభ చాటి తనేంటో ప్రపంచానికి తెలియజేసింది. తనకంటే చాలా తక్కువ వయసున్న నిక్ జోనస్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా తన భర్త నిక్తో ఎంజాయ్ చేసిన దృశ్యాలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ మధ్య ఓ ఈవెంట్లో నిక్ ప్రియాంకతో కాకుండా పాకిస్తానీ నటి మెహ్విష్ హాయత్తో కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోని హాయత్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ ఫోటో వెనుక గల కారణం వివరిస్తూ.. “నేను, నిక్ జొనాస్ యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్ మ్యాచ్ చూడడానికెళ్లాం. రఫెల్ నాదల్ మా ఫేవరెట్ ఆటగాడు. అందుకే అతనికి ఛీర్స్ చెప్పడానికెళ్లాం. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా నాదల్ గెలుస్తాడని మేమనుకున్నాం. అదే విధంగా జరిగింది. నాదల్ సెమీస్తో పాటు ఫైనల్లోనూ గెలిచి నాలుగోసారి యూఎస్ ఓపెన్ టైటిల్ను ముద్దాడాడు” అంటూ పోస్ట్ చేసింది. ప్రియాంక చోప్రా, ఫోటోలో ఉన్న పాకిస్తానీ నటి గతంలో ఇండియా, పాకిస్తాన్ ఆర్మీ విషయంలో విమర్శలు చేసుకున్నారు. ఇండియాను సమర్థిస్తూ ప్రియాంక, పాక్ను సమర్థిస్తూ హాయత్ వాదోపవాదాలు చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ప్రియాంక చోప్రా భర్త ఆమెతో కలిసి ఉన్న ఈ ఫోటోను కాస్త ఆసక్తిగా చూస్తున్నారు నెటిజన్లు.
previous post