telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మీరు ఒక్క బాంబు వేస్తె.. మేము 50 వేస్తాం అంటున్న పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ ..

pak ex president on war between inida-pak

పుల్వామా ఉగ్రదాడి పై పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ స్పందించారు. ఈ ఘటన అనంతరం భారత్-పాక్ మధ్య 2002 నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తాయని అన్నారు. అయితే భారత్-పాక్ మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశాలు మాత్రం లేవన్నారు. ఆ ప్రచారమంతా ఉదంతం అంటున్నాడు(అంటే మొత్తానికి యుద్ధం వస్తే బాగుంటుంది అని ఆయన ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నట్టే ఉంది. ఆయన వెనకాల ఉంది ఇదంతా నడిపిస్తున్నాడేమో అన్నట్టే ఉన్నాయి ఆయన మాటలన్నీ..).
దుబాయ్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ముషారఫ్.. యుద్ధమంటూ వచ్చి భారత్‌పై పాక్ ఒక బాంబు వేస్తే భారత్ 20 బాంబులు వేస్తుందని, అప్పుడు పాక్ మళ్లీ 50 బాంబులు వేయాల్సి వస్తుందని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు.

అణుయుద్ధం గురించి మాట్లాడేవారికి నిజానికి దానిపై ఏమాత్రం అవగాహన లేదని, రెండు దేశాల మధ్య అణు యుద్ధం వచ్చే అవకాశం లేదని చెప్పారు. ముఖ్యంగా గత దశాబ్దకాలంలో భారత్-పాక్ మధ్య శత్రుత్వం మరింత ఎక్కువైందని ముషారఫ్ అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా తన దళాలను ఉపసంహరించిన తర్వాత భారత్-పాక్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని ముషారఫ్ ఆందోళన వ్యక్తం చేశారు

Related posts