సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సావిత్రి బయోపిక్ విడుదలై మంచి ప్రేక్షకాదరణను పొందింది. ఇక సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగమైన “కథానాయకుడు” చిత్రం విడుదలైంది. త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగమైన “మహానాయకుడు”, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ విడుదల కానున్నాయి. తాజాగా మరో బయోపిక్ తెరకెక్కుతోంది.
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్ధి ఉద్యమ నాయకుడిగా పేరు పొందిన జార్జి రెడ్డి బయోపిక్ ను తెరకెక్కించనున్నారు. జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, జార్జి రెడ్డి పాత్రలో “వంగవీటి ఫేమ్” శాండీ నటిస్తున్నారు. నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో చదువుకున్న జార్జి రెడ్డి 25 ఏళ్ల వయసులో దుండగుల దాడిలో మరణించారు. త్వరలోనే ఈ చిత్రం బయోపిక్ ను విడుదల చేయనున్నారు.