లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై మంగళగిరి హై కోర్టు ఇంజక్షన్ గ్రాంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే సినిమా ప్రెస్ షోను కూడా క్యాన్సిల్ చేశారు. రేపు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.
ఇక సోషల్ మీడియాలో కూడా ఇంజక్షన్ గ్రాంట్ వర్తింపు ఉంటుందని సమాచారం. రామ్ గోపాల్ వర్మ అగస్త్య మంజులకు నిర్మాత రాకేష్ రెడ్డి లకు నోటీసులు కూడా పంపినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 15వరకు సినిమా హాళ్లలో ప్రదర్శన ఉండకూడదని కోర్టు వివరణ ఇచ్చినట్లు సమాచారం. యూ ట్యూబ్ – ఫెస్ బుక్ – ట్విట్టర్ మాధ్యమాలలో కూడా సినిమాకు సంబందించిన ఎలాంటి ప్రస్తావన ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
రోజాపై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు