నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఓ అంబులెన్స్ రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వేగంగా వెళ్లే క్రమంలో అంబులెన్స్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
సుమలత ఫేస్బుక్ బ్లాక్.. కుమారస్వామిపై ఫైర్