విశాఖ స్టీల్ ప్లాంట్పై ఏపీ రాజకీయాలు మరోసారి వేడేక్కాయి. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో విశాఖ ప్రజలతో సహా, ఏపీ మొత్తం కదిలింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకులు చేసిన ద్రోహం వల్లే విశాఖ ఉక్కును అమ్ముతున్నారని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. “రాష్ట్ర ప్రజల త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ని స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టోద్దంటూ సీఎం జగన్ గారికి లేఖ రాసాను. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలి. సొంత ఐరన్ మైన్ ని కేటాయించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చెయ్యాలి. 40 వేల మంది ప్రత్యక్షంగానూ, లక్షలమంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి. విశాఖ ఉక్కు అమ్మకం సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్కి చేసిన నమ్మకద్రోహమేనని వైసీపీ ఎంపీలే.. జగన్ రెడ్డి మీడియా సాక్షిలోనే చెబుతూ అడ్డంగా దొరికిపోయారు..ఉత్తరాంధ్ర ద్రోహులు ఏ1 జగన్ రెడ్డి, ఏ2 విజయసాయి రెడ్డిలను ప్రజలు తరిమికొట్టకపోతే.. యారాడ కొండ, సముద్రం, జనాల కిడ్నీలు కూడా అమ్మేస్తారు” అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.
next post
భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్: మోదీ