క్రియేటివ్ డైరెక్టర్గా ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు కృష్ణవంశీ. అయితే ఆయన ఖాతాలో ఈ మధ్య సరైన హిట్ పడలేదు. ఆయన దర్శకత్వం వహించిన “నక్షత్రం” సినిమా ఫ్లాప్ కావడంతో చాలా రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు మళ్ళీ తన తదుపరి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేస్తున్నారట ఈయన. సినిమాలో టాప్ హీరోయిన్ను నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. “రుద్రాక్ష” పేరుతో ఈ సినిమా రూపొందనుందని టాక్. బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వీరిద్దరూ గతంలో “గోవిందుడు అందరివాడేలే” సినిమాను రూపొందించారు. ఇప్పుడు వీరి కలయికలో రుద్రాక్ష రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఆంధ్రా మరో బీహార్ లా తయారైంది.. బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు