telugu navyamedia
Uncategorized

దళితుల భూములపై టీఆర్ఎస్ పెద్దల కళ్లు: మంద కృష్ణ

Manda Krishna

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిన్న ఆయన పర్యటించారు. కోనాయిగూడెంలో వైకుంఠధామం నిర్మిస్తున్న దళితుల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పచ్చి మోసగాడని, వచ్చే ఎన్నికల్లో ఆయనను తప్పకుండా ఓడించాలని లుపునిచ్చారు.

పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డిపైనా మంద కృష్ణ విరుచుకుపడ్డారు. దళితుల భూములను లాక్కోవడంలో ఉపేందర్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పెద్దల కళ్లు దళితుల భూములపై పడ్డాయని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి పేరుతో ఓట్లను కొల్లగొట్టి మోసం చేశారని మండిపడ్డారు.

Related posts