చైత్ర పూర్ణిమ మాల పూర్తి అయిన సందర్భంగా, విజయనగరం లక్ష్మీగణపతి కాలనీలో ఉన్న వల్లీదేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం కావడి అట్టం ఊరేగింపు ఘనంగా జరుగుతుంది…ఈ ఊరేగింపు పట్టణం పురా విధుల గుండా సాగనుంది.. ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కావడి ఊరేగింపులో మాల ధారణ చేసినవారు, మహిళలు కూడా కావడి మోశారు.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో పలు వేషధారణలు అందర్నీ అలరిస్తున్నాయి ..ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బేతా కృష్ణారావు, కార్యదర్శి శ్రీనివాస గోపాలకృష్ణ, కోశాధికారి సతీష్, ఉపాధ్యక్షులు దన్నాన రామమూర్తి, జగన్నాధరావు, రాయుడు, అర్చకులు శ్రీనివాస శర్మ, అగస్త్య శర్మ, ఆర్వీ పంతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకహోదాను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు:నారాయణ