త్రివిక్రమ్, యంగ్ టైగర్ కాంబోలో రెండో సినిమాగా తెరకెక్కనుంది. దీనికి అయినను పోయిరావలే హస్తినకు అనే పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు చిత్రీకరణను ప్రారంభించనుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను మే 20నుండి మొదలు చేయనున్నారట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ను మొదలు చేయనున్నారట. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించనున్నాడు. ఈ చిత్రంలో అతడి పాత్ర పూర్తి రాజకీయ నాయకుడిలా త్రివిక్రమ్ రూపొందించాడట. అంతేకాకుండా ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాల చుట్టూ తిరగనుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది కూడా ఇంకా తేలలేదు. అయితే దీనిపై ఓ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ వరీనా హుస్సేన్ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో తారక్కు జోడిగా వరీనా హుస్సేన్ నటించనుందట. ఈమె దబాంగ్-3 సినిమాలో సల్మాన్తో స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసింది. కాగా.. తారక్ తదుపరి చిత్రాన్ని నిర్మించే ఎన్టీఆర్ ఆర్ట్స్ హైదరాబాద్లో నిర్వహించిన టెస్ట్ షూట్లో కూడా ఈ బ్యూటీ పాల్గొందని టాక్. అయితే… దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
previous post
టీఆర్ఎస్ కు ప్రచారం చేస్తానంటున్న రేవంత్ రెడ్డి…