జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న ఓ పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు, స్థానిక పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.
అయితే ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సోమవారం రాత్రి ట్రక్ డ్రైవర్ను కాల్చి చంపిన ఉగ్రవాదిని మట్టు బెట్టినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల బృందం కశ్మీర్లో పర్యటిస్తున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.