తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న “ఇస్మార్ట్ శంకర్” జూలై 12న విడుదల కానుంది. “డబుల్ దిమాక్ హైదరబాదీ” అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. మీడియా సమావేశంలో నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మి మాట్లాడుతూ ‘‘సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మిగిలిన మూడు పాటలను హైదరాబాద్లో భారీ సెట్స్ వేసి చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు.