వ్యాపారం దినదినాభివృద్ధి కావాలని ఎవరైనా కోరుకుంటారు. అలా అవుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా విస్తరణ కూడా చేస్తారు. ఆ సందర్భంగా డిస్కౌంట్లు పెడుతుంటారు. దానివలన అక్కడ వారి శాఖ ఒకటి ఏర్పాటు అయిందని అందరికి తెలుస్తుంది, అలాగే మొదటి రోజు కొనుగోళ్లు తగినట్టుగా ఉంటాయి. ఇక ఆ సంస్థకు ఉన్న పేరును బట్టి వినియోగదారులు ఆ శాఖ వద్దకు వచ్చి కొనుగోళ్లు చేస్తుంటారు. అలాగే సంగీత మొబైల్స్ కూడా తన శాఖను పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బ్రహ్మాండమైన ఆఫర్ కూడా ప్రకటించింది. షాప్ ప్రారంభం రోజున 199 రూపాయలకు మొబైల్ అందిస్తామన్నది ఆ ఆఫర్. దానితో షాప్ తెరవకముందే జనాలు బారులు తీరి ఆఫర్ ను సొంతం చేసుకోడానికి సిద్ధం అయిపోయారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆర్ఆర్ పేటలో నూతనంగా ‘ సంగీత మొబైల్స్ ‘ షాప్ గురువారం ప్రారంభించారు. షాపు ఓపెన్ సందర్భంగా.. మొదటి 100 మంది కొనుగోలుదారులకు 199 రూపాయలకే సెల్ఫోన్లకు ఇస్తామని ప్రకటనలు గుప్పించడంతో ఉదయాన్నే షాపు వద్ద జనం బారులు తీరారు.
వివేకానందరెడ్డి హత్యలో టీడీపీ నేతల ప్రమేయం: షర్మిల