రాజధాని న్యూఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిత్యమూ ఎంతో బిజీగా ఉండే కరోల్ బాగ్ ప్రాంతంలోని అర్పిత్ ప్యాలెస్ అనే హోటల్ లో మంటలు చెలరేగతంతో ఈ ఘటన సంభవించింది. హోటల్ లో ఉన్న అతిథుల్లో 9 మంది సజీవ దహనమయ్యారు. హోటల్ లో ఇంకా చాలా మంది ఉండటంతో వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది.
ఘటన గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 10కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నాయి. కాలిన గాయాలతో బయటకు పరుగులు పెడుతున్న వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి కారణం షాక్ సర్క్యూట్ లేదా గ్యాస్ పేలుడుగా అనుమానిస్తున్నారు.