telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రోజువారి కూలీలకు కెసిఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్

రోజువారి కూలీలకు శుభ వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కూలీలకు కనీస వేతనాన్ని పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కూలీలకు రోజు వారి కనీస వేతనాన్ని రూ. 300 నుంచి ఏకంగా రూ. 390 కు పెంచింది. అలాగే కన్సాలిడేటెడ్ పే వర్కర్ల వేతనం రూ. 8000 నుంచి 10,400 పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అటు పార్ట్ టైం వర్కర్ల వేతనాలు కూడా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పార్ట్ టైం వర్కర్ల వేతనం నెలకు 4 వేల నుంచి రూ. 5200 కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన వేతనాలను జూన్ 1 నుంచి అమలు అవుతాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

Related posts