సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో నిన్న సాయంత్రం తేజ్కు వైద్యులు వెంటిలెటర్ తొలగించారు.
తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని , చికిత్సకు స్పందిస్తున్నారని, శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఈరోజు చేసిన పరీక్షల్లో నార్మల్ వచ్చినట్లు తెలిపారు.
శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్పై ప్రయాణిస్తున్న సాయితేజ్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలు కావడం తో అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఐసీయూలో తేజ్ కు చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం అతని దగ్గరికి ఎవ్వరిని అనుమతించడం లేదు వైద్యులు.. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలోని వైద్య బృందం తేజ్కు చికిత్స అందిస్తున్నారు..
ఆ హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడిన పూజా…