ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యరాజు లీడ్ రోల్లో నటిస్తోన్న సినిమా “నాట్యం”. నిశృంకల ఫిల్మ్ బ్యానర్పై నిర్మిస్తోన్న ఈ సినిమాను రేవంత్ కోరుకొండ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా టీజర్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. టైటిల్కు తగ్గట్టుగానే పూర్తిగా నాట్యం తో రొమాంటిక్గా నడిచింది ఈ టీజర్. ఈ సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లుగా తెలుస్తోంది. కమల్కామరాజు, రోహిత్ బెహల్, భానుప్రియ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సంధ్యరాజు, సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ ఫౌండర్ బీ రామలింగరాజు కోడలు లీడ్ రోల్లో నటిస్తున్నారు.