telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ముందు వీవీ ప్యాట్లను.. లెక్కించడం కుదరదు.. : కేంద్ర ఎన్నికల సంఘం

cec reply to court on vvpat

ఓట్ల లెక్కింపులో భాగంగా ఈవీఎం ఓట్ల కంటే ముందు వీవీ ప్యాట్లను లెక్కించాలన్న విపక్షాల డిమాండ్ ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. వీవీ ప్యాట్లను ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే లెక్కిస్తారని మరోసారి స్పష్టం చేసింది. 22 రాజకీయ పక్షాలకు చెందిన నేతలు, ప్రతినిధులు మంగళవారం ఈసీని కలిసి ఈవీఎంల కంటే ముందు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈసీని కలిసినవారిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, డీఎంకే మహిళా నేత కనిమొళి, వామపక్ష ప్రముఖులు ఉన్నారు. వీవీ ప్యాట్ల విషయంలో తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని ఆయా పార్టీల నేతలతో ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం త్రిసభ్య కమిటీ తాజాగా సమావేశమై చర్చించింది. రాజకీయ పక్షాల వినతి మేరకు వీవీ ప్యాట్లను మొదటే లెక్కించడం కుదరదని తేల్చి చెప్పింది.

Related posts