telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“గుడ్ న్యూస్” అంటున్న అక్షయ్ కుమార్

Good-Newz

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ తాజాగా “గుడ్ న్యూస్” అనే కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కరీనా కపూర్, కియారా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్నారు. దిల్జీత్ దొసాన్జ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. పోస్టర్‌లో కరీనా, కియారా ప్రెగ్నంట్ అయినట్లుగా చూపించారు. వారి మధ్య అక్షయ్, దిల్జీత్ నలిగిపోతున్నట్లు కనిపించారు. పోస్టర్‌లో వీర్య కణాలను మార్పిడి చేసినట్లు కూడా చూపించారు. ఈ పోస్టర్ విడుదలవగానే నెటిజన్స్ నుంచి ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో కరీనా అక్షయ్ కుమార్ భార్యగా, కియారా దిల్జీత్ భార్యగా కనిపించనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజ్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2019 డిసెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల అక్షయ్ నటించిన మల్టీస్టారర్ కామెడీ ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.

Related posts