దేశం మొత్తని కరోనా గజగజ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఎవరిని వదలి పెట్టడం లేదు ఈ వైరస్. అయితే తాజాగా ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ చోటా రాజన్ కరోనా కారణంగా మరణించాడు. అయితే గత నెల 24న కరోనా బారిన పడ్డారు చోటా రాజన్. దాంతో తిహాడ్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న చోటా రాజన్ ను ఎయిమ్స్ కు తాలించారు. కానీ చోటా రాజన్ పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆసుపత్రిలోనే మృతి చెందాడు. అయితే దేశంలో గత కొన్ని రోజుల నుంచి రోజువారీ కరోనా కేసులు రోజుకు 4 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడంతో పాటుగా మరణాల రేటు కూడా పెరుగుతున్నది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు టెస్టులను పెంచుతున్నారు.
previous post
వివేకానందరెడ్డి హత్యలో టీడీపీ నేతల ప్రమేయం: షర్మిల