telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అమరజవాన్ల .. తల్లులకు పాదాభివందనం చేసిన.. నిర్మలాసీతారామన్ !

defence minister respecting pulwama affected

రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్ల తల్లులకు పాదాభివందనం చేశారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ మంత్రి పాల్గొన్నారు. ‘శౌర్య సమ్మాన్ సమరోహ్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమర జవాన్ల తల్లులను మంత్రి ఘనంగా సన్మానించారు. వారిని శాలువతో సత్కరించిన అనంతరం పాదాలకు నమస్కరించి వారిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

నిర్మలా సీతారామన్ పాదాలకు నమస్కరించేందుకు కిందకు వంగుతుండడంతో అవాక్కైన కొందరు తల్లులు వారించినా ఆమె పట్టించుకోలేదు. అమరవీరుల తల్లులకు మంత్రి ఇస్తున్న గౌరవాన్ని చూసిన అధికారులు, కార్యక్రమానికి హాజరైన వారు కరతాళ ధ్వనులతో మంత్రిని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

video source : abp net

Related posts