telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మానసిక వైద్యులతో ప్రత్యేక తరగతులు

school teachers class

10వ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసేందుకు మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మానసిక వైద్యులతో ప్రత్యేక తరగతు లను నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షలు అనగానే కొందరు విద్యార్థులు ఆందోళ నకు గురవుతుంటారని జిల్లా విద్యాధికారి ఐ. విజయకుమారి అన్నారు.

విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు సైకాలజిస్టులతో విద్యార్థులను వార్షిక పరీక్షలకు మానసికంగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 60శాతం ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని, మిగిలిన విద్యార్థులకు కూడా ఒకటి రెండు రోజుల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె తెలిపారు.

Related posts