కరోనా వైరస్ దెబ్బకు కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిలిపివేశారు. మందు బాబుల ఆటకట్టించే పోలీసులకు, ఇప్పుడు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు వద్దని ఆదేశాలు అందాయి. రాజధాని బెంగళూరులో ఆల్కోమీటర్ ద్వారా మద్యం పరీక్షలు చేయవద్దని ట్రాఫిక్ పోలీస్ హెడ్ రవికాంతే గౌడ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
అనేక మంది ఒకే ఆల్కో మీటర్ ద్వారా గాలిని ఊదడం వల్ల, ఎవరికైనా కరోనా వైరస్ సోకివుంటే, అది ఇంకొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఒకవేళ, వాహనదారులు ఎవరైనా మద్యం తాగినట్టు పోలీసులకు రూఢీగా తెలిస్తే, ఇతర మార్గాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని రవికాంతే గౌడ ఆదేశించారు.
సమాజంలో మహిళల పట్ల చులకనభావం పోవాలి: కోదండరాం