ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు ఉదయం 8.49 గంటలకు సచివాలయంలోని సీఎం చాంబర్లో అడుగుపెట్టనున్నారు. దీంతో ముఖ్యమంత్రి చాంబర్ మొదటి బ్లాక్ను వాస్తుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. రేపు జరగనున్న మంత్రుల పదవీ ప్రమాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్నారు.
ఈ సందర్భంగా 25 మంది కొత్త మంత్రులతో రేపు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ చేరుకున్న గవర్నర్ ను సీఎం జగన్ కాసేపట్లో కలవనున్నారు. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్త మంత్రి వర్గం జాబితాను గవర్నర్ కు జగన్ అందజేయనున్నారు. ఈ జాబితాను గవర్నర్ ఆమోదించిన తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది.