telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

తొలుత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మాన

ఆంద్రప్రదేశ్ నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్ సమక్షంలో మొదట ధర్మాన కృష్ణ ప్రసాద్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత, బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు,  కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని) మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. 

అనంతరం పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత,  ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన మంత్రులతో ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, పలువురు ప్రభుత్వ అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Related posts