telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ మధ్య వాగ్వాదం

voilance jummalamadugu ycp tdp

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు చోట్ల ఈ నెల 19న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రామచంద్రాపురం మండలంలోని ఎన్ఆర్ కమ్మపల్లిలో గురువారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని దళితులపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారని, తమకు వ్యతిరేకంగా ఓటేస్తే అంతుచూస్తామని బెదిరిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామానికి చేరుకున్నారు.అయితే స్థానికులు ఆయనను అడ్డుకున్నారు.

విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు చెవిరెడ్డి, పులివర్తి నానిలను అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. అయితే గ్రామంలోని దళితులపై టీడీపీ నేతలు దాడి చేశారని, వారిని పరామర్శించేందుకు వెళ్తుండగా తనను అడ్డుకున్నారని చెవిరెడ్డి తెలిపారు.

Related posts