telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జులై నుండి పోలవరం నుంచి .. నీటిని విడుదల చేయాలి.. : చంద్రబాబు

chandrababu orders to polavaram engineers

సీఎం చంద్రబాబు జులైలో పోలవరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం 69 శాతం పూర్తయిందని, కాంక్రీట్ పనులు 72.40 శాతం పూర్తయ్యాయి, 28.16 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి, తవ్వకం పనులు 84.60 శాతం పూర్తయ్యాయని, ఇప్పటివరకూ కుడి ప్రధాన కాల్వ పనులు 90.87 శాతం, ఎడమ ప్రధాన కాల్వ పనులు 70.38 శాతం పూర్తయినట్టు చెప్పారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు 66.22 శాతం, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 40.71 శాతం, దిగువ కాఫర్ డ్యామ్ పనులు 25.04 శాతం పూర్తయినట్టు వివరించారు.

Related posts