కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం ఏపీ ఎన్నికల ప్రధానాకాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై ద్వివేది వివరణ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే పనిస్తున్నామని స్పష్టం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం కూడా నియమావళికి లోబడే తమకు సూచనలు చేస్తోందన్నారు. ఒకే పార్టీకీ ఏకపక్షంగా వ్య్వాహరించాలని సూచించడం లేదని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులపై ఎవరి ఒత్తిళ్లు లేవని ద్వివేది పునరుద్ఘాటించారు. ఎన్నికల నిర్వహణలో తాము అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.