telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు కాంపౌండ్… “పేట” నిర్మాతలకు వార్నింగ్

Bunny-Vasu

రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ ప్రముఖ నిర్మాతల కనుసైగల్లోనే నడుస్తాయని, వారు చెప్పిన సినిమాలకే థియేటర్లు కేటాయిస్తారని, అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ వారు “పేట” సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారని “పేట” తెలుగు నిర్మాత అశోక్ వల్లభనేని నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ వారిపై మండిపడ్డాడు. ఈ కుక్కలకు బుద్ధి చెప్పాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక థియేటర్ల మాఫియా కారణంగా “పేట” సినిమాకు సమస్య ఉందని, సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపలేరని, ముగ్గురు, నలుగురు చేస్తున్న సినిమాలకు మాత్రమే అన్ని థియేటర్లనూ కేటాయించుకుంటున్నారని, ఇతరులను బతకనిచ్చే పరిస్థితి లేదని నిర్మాత టి.ప్రసన్నకుమార్ వాపోయారు. ఉన్న అన్ని థియేటర్లలో ఆ రెండు మూడు సినిమాలు మాత్రమే ఆడిస్తుంటే ఎలాగని ప్రశ్నించారు. తమ సినిమాలే ఉండాలన్న ధోరణి మంచిది కాదని అన్నారు.

అశోక్ వల్లభనేని, ప్రసన్న కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అల్లు కాంపౌండ్ ఫైర్ అయింది. గీతా ఆర్ట్స్ సంస్థలో కీలక పాత్ర పోషించే నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియా ద్వారా “పేట” నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చాడు. ”ప్రసన్న గారు, తమరు తెలిసీ తెలియని మిడి మిడి జ్ణానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పొయే పరిస్థితి కి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం అనే హద్దుని దాటడం మాత్రమే మిగిలింది” అంటూ వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఓ పోస్ట్ పెట్టాడు. మరి దిల్ రాజు, యువి క్రియేషన్స్ వారు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related posts