యంగ్ హీరో నాగశౌర్య “ఊహలు గుసగుసలాడే” సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. 2018లో ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నాగశౌర్య ఆ తర్వాత కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల వంటి చిత్రాలతో వరుస ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. ఇటీవల “ఓ బేబి” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించినప్పటికి ఆ క్రెడిట్స్ అన్నీ సమంతకే దక్కాయి. అయితే లేడి డైరక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగ శౌర్య యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేనుండగా, ఈ చిత్రానికి “మూగ మనసులు” అనే క్లాసిక్ టైటిల్ని పరిశీలిస్తున్నారట. సితార ఎంటర్టైన్మెంట్ బేనర్పై రూపొందనున్న ఈ చిత్రం అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది. వచ్చే ఏడాది మేలో విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మృణాల్ ఠాకూర్ “సూపర్ 30”, “బాట్లా హౌస్” లాంటి బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే ఈ బ్యూటీ అంతకుముందు సీరియళ్ళలో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె నటించిన “కుంకుమ భాగ్య” సీరియల్ తెలుగులో కూడా ప్రసారం అయిన విషయం విదితమే.
previous post
next post
“సైరా”తో “వార్”… చిరంజీవిపై హృతిక్ వ్యాఖ్యలు