లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తుందని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 లోక్సభ ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే బీజేపీకి ఈసారి ఎక్సీట్లే వస్తాయనిజోస్యం చెప్పారు. 2014 ఎన్నికల్లో మోదీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఇప్పుడు ఆయనపై మరింత విశ్వాసాన్ని పెంచాయని ఆయన అన్నారు.
గత ఐదేళ్లలో ద్రవ్యోల్భణమనేది ఒక అంశమే కాలేదని, ఎన్నికల ప్రచారంలో కూడా దాని ఊసే లేదని అన్నారు. దీనినిబట్టే ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునని చెప్పారు. పశ్చిమబెంగాల్లో హింసాత్మక ఘటనలు చేటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో హింసాకాండను ముఖ్యమంత్రి అడ్డుకోలేకపోయారని అన్నారు.