telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుక కొరత ప్రభుత్వం సృష్టించిందే: కన్నా

Kanna laxminarayana

రాష్ట్రంలో ఇసుక కొరత ప్రభుత్వం సృష్టించిందేనని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక అందుబాటులో లేకుండా చేయడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఇసుక వారోత్సవాలు జరిపి ఏంసాధిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఐదు నెలలకే విసిగిపోయి వైసీపీ నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని కన్నా వెల్లడించారు.

నేతలు రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని, వ్యక్తిగత దూషణలు సరికాదని హితవు పలికారు. నాయకుడు నోరు పారేసుకుంటే చులకన అవుతారని వ్యాఖ్యానించారు. ఇక, జాతీయ రాజకీయాలపై స్పందిస్తూ, రాఫెల్ అంశాన్ని రాహుల్ గాంధీ రాజకీయం చేయాలని చూశారని పేర్కొన్నారు. రాహుల్ ప్రధానికి క్షమాపణలు చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు.

Related posts