అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే రాజధాని వికేంద్రీకరణ ప్రధాన ఉద్దేశమని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వల్ల పొందే ప్రయోజనాలు ఢిల్లీ పెద్దలకు తెలిసేలా పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు రాష్ట్రపతికి పోస్టు కార్డులు రాయనున్నట్లు తెలిపారు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి అడ్డుపడుతున్నారని, మండలి రద్దు విషయంలోనూ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని మంత్రి అన్నారు.