ఏపీ 15వ శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రోటెం స్పీకర్గా శంబంగి చినఅప్పలనాయుడు వ్యవహరిస్తున్నారు.
ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. తొలుత సీఎం వైఎస్ జగన్, అటు తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది.