రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సోమవారం ఏపీలో కొత్తగా 1,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఏపీలో 1,263, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా సోకింది. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 20,019కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. ఏపీలో 10,860 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా జయించి 8,920మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో కరోనాతో మొత్తం 239మంది మృతి చెందారు. లాక్డౌన్ను అమలు చేసినప్పుడు జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రత అదుపులో ఉంది. నిబంధనలను సడలించడం, ప్రజలు బయట తిరుగుతుండటం, అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తుండటంతో కరోనా కాలనాగు మరింత పడగ విప్పింది. ఈ నేపథ్యంలో ఇకనైనా కట్టుదిట్టమైన జాగ్రత్తలు, నిరోధక చర్యలు తీసుకోవాల్సి ఉందని వైద్యవర్గాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వం వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, సమూహ వ్యాప్తికి రాకముందే కఠినమైన కార్యాచరణను చేపట్టాలన్నారు.
#COVIDUpdates: 06/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,365 పాజిటివ్ కేసు లకు గాను
*7252 మంది డిశ్చార్జ్ కాగా
*239 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9874#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0xVb7XgnHP— ArogyaAndhra (@ArogyaAndhra) July 6, 2020
రెచ్చగొట్టే వ్యాఖ్యలేమీ లేవు.. అక్బరుద్దీన్కు పోలీసుల క్లీన్ చిట్!