నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత సంవత్సరం జరిగిన పరువు హత్యలో భర్త ప్రణయ్ను పొగుట్టుకున్న అమృతవర్షిణి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పట్లో ఈ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. పట్ట పగలే తన కళ్ల ముందే భర్త ప్రణయ్ను దారుణంగా హత్య చేయడంతో ఐదు నెలల గర్భంతో ఉన్న అతని భార్య అమృత అప్పట్లో షాక్ కు గురైంది. తాజాగా మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో అమృత మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రణయ్ది షెడ్యూల్డ్ కులానికి చెందిన మధ్యతరగతి కుటుంబం. అమృతది వైశ్య సామాజిక వర్గం కావడంతో మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షతో అమృతవర్షిణి తండ్రి మారుతి రావు కిరాయి హంతకులతో ప్రణయ్ని హత్య హత్య చేయించి ఉంటారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు మారుతీ రావు ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
బీజేపీ ఎంపీ సోయం మాట తప్పారు: ఎమ్మెల్యే జోగు రామన్న