telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

లెటర్ ప్యాడ్ పై మంత్రి సంతకం ఫోర్జరీ?

vanitha tatineni minister

అసైన్డ్ భూమి పొందడం కోసం ఓ వ్యక్తి ఏకంగా మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. ఆ భూమి పొందడం కోసం రెడ్డప్ప అనే వ్యక్తి పాల్పడిన ఈ చర్య చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే…తనకు భూమి కేటాయించాలని కోరుతూ ఏపీ మంత్రి వనిత కలెక్టర్‌కు సిఫారసు చేసినట్లుగా రెడ్డప్ప లెటర్ ప్యాడ్ పై ఫోర్జరీ సంతకంతో ఓ లేఖ సృష్టించాడు.

ఫోర్జరీ సంతకంతో ఉన్న లెటర్ ప్యాడ్ తీసుకువెళ్లి కలెక్టర్ కు అందించాడు. అధికారుల క్రాస్ చెకింగ్ లో అది నకిలీ అని తేలింది. విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆశ్చర్యపోయిన ఆమె సదరు వ్యక్తిపై హోంమంత్రికి, డీజీపీకి ఫిర్యాదు చేశారు.

Related posts