ఈనెల 16న సాయంత్రం 4:25కు హిమాయత్సాగర్ ప్రాంతంలో టీఎస్09ఎఫ్జీ 0666 నంబర్ గల క్యారవాన్ వెళ్తోంది. ట్రాఫిక్ జామ్ కావడంతో అటుగా వెళ్తున్న మహ్మద్ అబ్దుల్ ఆజం దాన్ని గమనించాడు. క్యారవాన్ అద్దాలు పూర్తిగా బ్లాక్ఫిల్మ్తో కప్పబడి ఉన్నాయి. రాష్ట్రంలో బ్లాక్ఫిల్మ్ అద్దాలపై నిషేధం ఉండటంతో అబ్ధుల్ ఆజం క్యారవాన్ వాహనాన్ని ఫొటోతీసి ట్విటర్లో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిటిజన్స్ నుంచి వచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు, క్యారవాన్ వాహనాన్ని పరిశీలించి అల్లు అర్జున్కు చెందినదిగా గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి క్యారవాన్ వాహనం అద్దాలకు బ్లాక్ఫిల్మ్ ఉపయోగించినందుకుగాను యజమాని అల్లు అర్జున్కు రూ. 735లు జరిమానా విధించారు. ఇటీవల “ఇస్మార్ట్ శంకర్” సినిమా హిట్ అయ్యిందన్న సంబరంలో సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ బుల్లెట్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పోలీసులకు సవాల్ విసిరాడు. ఫలితంగా సైబరాబాద్ పోలీసులు జరిమానా విధించారు. ఈ ఘటన జరగడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందే అల్లు అర్జున్ కు చెందిన క్యారవాన్కు జరిమానా విధించారు సైబరాబాద్ పోలీసులు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
previous post
ఆర్ఆర్ఆర్ : తుఫాను ముందు వ్యక్తి… రాజమౌళిపై ఎన్టీఆర్ కామెంట్