telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

ఆఫీసులోనే .. మద్యం ఏర్పాట్లా .. కొత్త ట్రెండ్..!

alcohol consumption in office only

ఆరుగురు పంచాయతీ సెక్రటరీలపై ప్రభుత్వ ఆఫీసులో మందు తాగి బాధ్యతారహితంగా ప్రవర్తించిన సస్పెన్సన్ వేటు పడింది. మే 4న రాయ్ గఢ్ జన్ పత్ ఆఫీసులోని కాన్ఫరెన్స్ హాల్ లో శ్యాం చౌహాన్, ప్యారే లాల్ పటేల్, రోహిత్ పటేల్, విజయ్ రావ్, రోహిణి నాయక్ తోపాటు మరో పంచాయతీ ఉద్యోగి మద్యం సేవించారు.

ఆఫీసులో మద్యం సేవించిన ఫొటోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఫొటోలు స్థానిక వార్తాపత్రికలు, మీడియాలో రావడంతో వైరల్ అయ్యాయి. దీని తో రాయ్ గఢ్ జిల్లా పంచాయత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చందన్ సంజయ్ త్రిపాఠి ఆరుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Related posts