స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’, ‘ఓ డాడీ’ పాటలు చిత్రంపై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. మొదటి పాట ‘సామజవరగమన’ కు ఇప్పటివరకు యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఆడియో సంగీత ప్రియులని ఎంతగానో అలరించడమే కాక పలు రికార్డులు క్రియేట్ చేసింది. దాయాది దేశం పాకిస్తాన్లోను ఈ సాంగ్పై చర్చ జరిగింది. తాజాగా ఈ సాంగ్కి సంబంధించి ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ సాంగ్లో అల్లు అర్జున్, పూజా హెగ్డేల లుక్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ సాంగ్ ప్రోమోను వీక్షించండి.
previous post
ఇది చాలా అద్భుతం.. కేవలం ఒకే ఒక్క మనిషి డొనాల్డ్ ట్రంప్ ఇది చేయగలిగారు : ఆర్జీవీ