telugu navyamedia
రాజకీయ

చిదంబరంకు మరోసారి ఊరట! 

ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసులో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ.చిదంబరంకు మరోసారి ఊరట లభించింది. ఈయనతోపాటు కుమారుడు కార్తీ చిదంబరాన్ని కూడా మార్చి 8 వరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులలో ప్రశ్నించడానికి మార్చి 5, 6, 7, 12 తేదీల్లో సీబీఐ కోర్టుముందు హాజరు కావాలని  కోరామని ఈడీ కోర్టుకు తెలిపింది. 
అనంతరం కేసును మార్చి12వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసును  ఈడీ  కావాలనే ఆలస్యం చేస్తోందని చిదంబరం ఆరోపించారు. కాగా 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌కు సంబంధించి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపిబి) ఆమోదం విషయంలో కార్తి చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.

Related posts