మెగా హీరో సాయితేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమా చేస్తున్నాడు. సాయితేజ్ త్వరలో దేవకట్టా తెరకెక్కించనున్న పొలిటికల్ థ్రిల్లర్లో నటించనున్నాడు. తాజాగా మరో సినిమాను సాయితేజ్ అంగీకరించాడట. ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథ సాయితేజ్కు బాగా నచ్చిందట. ఈ సినిమాకు ‘భగవద్గీత సాక్షిగా’ అనే టైటిల్ అనుకుంటున్నారట. కథ కొత్తగా అనిపించడంతో ఆ డైరెక్టర్ను మెగాస్టార్ చిరంజీవి వద్దకు సాయితేజ్ తీసుకెళ్లాడట. కథ విన్న చిరంజీవి క్లైమాక్స్లో కొన్ని మార్పులు సూచించారట. చిరు సూచించిన మార్పులు చేసే పనిలో ఆ డైరెక్టర్ బిజీగా ఉన్నాడట. ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజుపండగే’ వంటి సినిమాలతో ఇటీవలే విజయాలు అందుకున్నారు సాయితేజ్.
previous post
next post