బీజేపీ పై బురద జల్లడానికి ఉన్న ఒకేఒక పెద్ద అస్త్రం రాఫెల్ కుంభకోణం. దానిపై ఇటీవల కోర్టు విచారణ అవసరం లేదని, కొన్నిటిలో గోప్యత అవసరం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనితో బాగా అసంతృప్తికి గురైన కాంగ్రెస్, మరోసారి ఈ కుంభకోణంపై విచారణ జరగాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీనితో మళ్ళీ రాఫెల్ రాజుకోనుంది. రాజకీయ దుమారానికి కారణమైన రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం మళ్లీ సుప్రీం కోర్టు గడపతొక్కింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో బీజేపీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తూ గత ఏడాది డిసెంబరు 14న తీర్పుఇచ్చిన విషయం తెలిసిందే. రఫెల్ ఒప్పందం ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదిక కనిపించలేదని కోర్టు ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. యుద్ధ విమానాల ఆవశ్యకత, నాణ్యతపై ఎటువంటి అమానాలు లేవని, ఒప్పందం రద్దు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ సీనియర్ నాయకులు యశ్వంత్సిన్హా, అరుణ్శౌరి, న్యాయవాది ప్రశాంత్భూషణ్లు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని, అందువల్ల తీర్పును పున:సమీక్షించాలని తమ పిటిషన్లో కోరారు. తమ రివ్యూ పిటిషన్పై బహిరంగ న్యాయస్థానంలో విచారణ జరిపించాలని పిటిషన్ దారులు కోర్టుకు విన్నవించారు.