telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చైనా అలా ఎందుకు చేసిందని ప్రశ్నిస్తున్న యంగ్ హీరో

nikhil

చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. లక్షలాది మంది వైరస్‌కు బలైపోతున్నారు. అయితే, ఈ వైరస్ విషయంలో చైనా కుట్రపూరితంగా మిగిలిన దేశాలను అప్రమత్తం చేయలేదని చాలా మంది అంటున్నారు. తాజాగా వీరి ఖాతాలో హీరో నిఖిల్ సిద్ధార్థ చేరారు. ఈ కరోనా వైరస్ చైనాలోని ఒక ల్యాబ్ నుంచి లీక్ అయ్యి ఉండొచ్చని న్యూయార్క్ పోస్ట్ వార్తా వెబ్‌సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని ఒక నెటిజన్ ట్వీట్ చేస్తూ.. ‘‘చైనాలోని వుహాన్‌లో ఉన్న బయోలాబ్ నుంచి కరోనా వైరస్ వచ్చిందని ఆధారాలు బలపడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా ఈ నిజాన్ని దాయాలని ప్రయత్నిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌‌ను హీరో నిఖిల్ రీట్వీట్ చేస్తూ ఆ వాదనను సమర్థించారు. వుహాన్ నుంచి మిగిలిన చైనాలోని ప్రాంతాలకు ప్రయాణాలను తక్షణమే నిలిపివేస్తూ జనవరిలో చైనా నిర్ణయం తీసుకుంది. కానీ, వుహాన్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను మాత్రం నిరంతరాయంగా నడిపింది. చైనా ఎందుకిలా చేసింది? వుహాన్ నుంచి మిగిలిన దేశాలకు ప్రజలు ప్రయాణించే సదుపాయం ఎందుకు కల్పించిందని నిఖిల్ ప్రశ్నించారు.

Related posts