మనిషి, జంతువు… వీరిలో ఎవరు ఎక్కువ ప్రమాదకరం? ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువు దాడి చేస్తుంది… మనిషి దాడి చేయడానికి కారణం అవసరం లేదు. ఈ అంశం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘గర్జన’. శ్రీరామ్, లక్ష్మీరాయ్ జంటగా జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై బి. వినోద్ జైన్ సమర్పణలో ఎం. నరేష్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా విఎఫ్ఎక్స్ తో రూపొందిన పులి ఈ చిత్రం ద్వారా ఎక్కువసేపు వెండితెరమీద కనిపించనుంది. ఓ చిన్నారి, ఓ యువతి, పులి మధ్య సాగే ఈ పులి వేట ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో పులి మనుషులను వెటాడుతూ ఉండగా.. దానిని పట్టుకోవడానికి అధికారులు శతివిధాలుగా ప్రయత్నిస్తుంటారు. సస్పెన్స్ థ్రిల్లర్తో కథాంశాన్ని రూపొందినట్లుగా తెలుస్తోంది. రక్తం మరిగిన పులికి చిక్కకుండా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి లక్ష్మీరాయ్ ప్రయత్నిస్తోంది. ఈ ట్రైలర్తో సినిమా ఎంతో ఆసక్తిని రేపుతోంది.
previous post